ప్రతి మహిళ శ్రీకృష్ణుడిలా మహారక్షకుడిలా మారాలని,ఎంతటి కార్యానయినా సాధించాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరాని పిలుపునిచ్చారు.శ్రీకృష్ణుడు ఎలాగైతే పాండవుల పక్షాన నిలబడి విజయం సమకూర్చాడో అల్లాగే రెట్టింపు ఉత్సాహంగా నేటి మహిళ ముందుకు రావాలి .
అందులో దృఢ దీక్షాపరులైన బీహార్ మహిళలు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మనసావాచా గెలిపించి అధికారం కట్టబెట్టాలని కోరారు.ప్రతి మహిళను కోరినది ఒక్కటే .మహిళలే బీజేపీకి సారథులుగా, మార్గాదర్సకులుగా ఒకటేమిటి సర్వం తామే అయిపోయి ముందుకు నడిపించాలి అని ఇరానీ కోరారు .ఆమె ఆదివారం పాట్నాలో బీజేపీ మహిళా మహా సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొని పై విధంగా కొరారు.దాంతో అక్కడ పెద్దయెత్తున హాజరయిన మహిళల చప్పట్లతో హోరెత్తారు .బీజేపీ హయాంలోనే బీహార్ అసెంబ్లీలో మహిళా బిల్లు, స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాయిని గుర్తుచేశారు.ఈ ఏడాది నవంబర్ లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆరు నెలల ముందు నుంచే పార్టీలన్నీ ప్రచారంలో తల మునకలై ఉన్నాయి
.