తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటన చేయడం కొత్తేమి కాకపోయినా అప్పుడప్పుడు అలా వెళ్లి వస్తుంటారట.ఈ క్రమంలో మరొకసారి కాళేశ్వరాన్ని చూడాలని కోరిక కలిగింది కావచ్చూ కేసీఆర్ కు.
అందుకే రేపు అంటే మంగళవారం కాళేశ్వరం పర్యటనకు సిద్దం అయ్యారట.
హైదరాబాద్ నుండి రేపు ఉదయం హెలికాప్టర్లో బయలుదేరనున్న తెలంగాణ సీఎం ఉదయం 10 గంటలకు మేడిగడ్డ చేరుకోనున్నారని సమాచారం.
కాగా మేడిగడ్డ రిజర్వాయర్లో నీటి మట్టం 100 ఎఫ్ఆర్ఎల్కు చేరుకోవడంతో సీఎం కేసీఆర్ ఈ బ్యారేజ్ను సందర్శించనున్నారట.అదీగాక అధికారులతో కలిసి సుమారు 4 గంటల పాటు బ్యారేజ్ పరిసరాల్లో పర్యటించనున్నారని, మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరే మధ్యాహ్న సమయంలో భోజనం చేసి అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారని అధికారుల నుండి సమాచారం.
ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్స్ కరోనా వచ్చినప్పటి నుండి సరిగ్గా బయటకు రాని ముఖ్యమంత్రి కాళేశ్వరాన్ని సడెన్గా ఎందుకు చూడవలసి వచ్చిందో అని చెవులు కొరుక్కుంటున్నారట.