ఐపీఎల్ సీజర్ 17( IPL Season 17 ) లో భాగంగా ఇప్పటికే దాదాపు అన్ని టీమ్ లు కూడా సగానికి పైగా మ్యాచ్ లు ఆడాయి.కాబట్టి ప్రస్తుతం ఉన్న సిచువేషన్ ను బట్టి చూస్తే ఈసారి సెమీస్ కి వెళ్లే టీమ్ లు ఏవి అనే దానిపైన ఇప్పటివరకైతే ఒక క్లారిటీ అయితే రాలేదు.
ఎందుకంటే ఒక్కో మ్యాచ్ లో ఒక టీమ్ విజయం సాధిస్తే మరొక మ్యాచ్ లో ఓడిపోతుంది.అలాగే ఇంకా ఎలాగైనా సరే ఈ టీం మంచి విజయాలను సాధిస్తుంది అని అంచనాలను పెట్టుకున్న ప్రతిసారి ఆయా టీమ్ లు ఓడిపోతు వస్తున్నాయి.
ఉదాహరణకి మొదట చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings )మంచి విజయాలు అందుకున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం తడబడుతూ వస్తుంది.ఇక హైదరాబాద్ టీమ్ కూడా మంచి విజయాలతో దూసుకుపోతున్నప్పటికీ, రీసెంట్ గా ఢిల్లీ మీద జరిగిన మ్యాచ్ లో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది.ఇక రాజస్థాన్ రాయల్స్ టీమ్( Rajasthan Royals Team ) కూడా మొదట కొన్ని మెరుపులు మెరిపించింది.కానీ వాళ్ళు కూడా కొంచం తడపడుతున్నారు.ఇకమీదట జరిగే మ్యాచ్ లను బట్టి సెమీస్ కి వెళ్ళే టీమ్ లను అంచనా వేయవచ్చు.
అయితే ప్రతి టీం కూడా మంచి ఫామ్ లో ఉండి ముందుకు దూసుకుపోతున్నప్పటికీ ఆయా ప్లేయర్లు కచ్చితంగా పెర్ఫా మెన్స్ ని ఇవ్వకపోవడం వల్ల ఒక్కో మ్యాచ్ లో ఒకటి ఓడిపోతూ వస్తున్నాయి.ఇక నిజానికి టాప్ ప్లేస్ లో ఉన్న టీం లన్ని కూడా చివరి ప్లేస్ లో ఉన్న టీమ్ లా చేతిలో ఓడిపోవడం అనేది నిజంగా దారుణమైన విషయమనే చెప్పాలి.ఇప్పుడు జరుగుతున్నది అదే మరి సెమీస్ కి వెళ్ళే టీములపైన సరైన క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.