బిగ్ బాస్( Big Boss ) కంటెస్టెంట్లలో ఒకరైన పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) కు ప్రేక్షకుల్లో పాజిటివిటీ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పల్లవి ప్రశాంత్ రైతుబిడ్డ కావడంతో పాటు కల్లాకపటం లేని వ్యక్తి కావడంతో ఆయనను అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడానికి పల్లవి ప్రశాంత్ ఎంత కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే తాజాగా ప్రోమోలో నాగార్జున( Nagarjuna ) రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ పై ఫైర్ అయ్యారు.మా నాన్న కూడా ఊరోడే అంటూ నాగ్ చెప్పుకొచ్చారు.నిన్న ఉదయమే ఈ ఎపిసోడ్ షూటింగ్ జరగడంతో ఈరోజు వేగంగా బిగ్ బాస్ షో ప్రోమోలు విడుదలయ్యాయి.
నామినేషన్స్ సమయంలో సందీప్ మాస్టర్ తనను ఊరోడు అన్నాడంటూ పల్లవి ప్రశాంత్ నానా రభస చేశాడనే సంగతి తెలిసిందే.
ఆ సమయంలో తాను ఊరోడు అని అనలేదని సందీప్ ప్రమాణం చేసి చెప్పాడు.ఈ విషయాన్ని నాగ్ గుర్తు చేయడంతో పాటు సందీప్ ఒట్టు వేస్తే నువ్వు ఎందుకు వెయ్యలేదని ప్రశ్నించారు.నాగ్ అలా కామెంట్ చేయడంతో పల్లవి ప్రశాంత్ ఏడ్చేశాడు.
ఆ సమయంలో నాగార్జున ఒకరిపై నింద వేసే సమయంలో నిజమై ఉండాలని ఇవన్నీ కాదని అసలు ఊరోడు అనడం తప్పా అని నాగ్ ప్రశ్నించారు.అందరూ ఊరినుంచే వచ్చారని అందరికీ తిండి పెట్టేది ఊరేనని మా నాన్న ఊరోడని నేను గర్వంగా చెబుతున్నానని నాగ్ పేర్కొన్నారు.
అందులో తప్పేం లేదని నాగ్ తెలిపారు.ఇప్పటివరకు ఈ వీడియోకు ఏకంగా 17 లక్షల వ్యూస్ వచ్చాయి.సినిమా సినిమాకు నాగ్ రేంజ్ పెరుగుతుండగా బిగ్ బాస్ షో ద్వారా కూడా నాగ్ ప్రశంసలు అందుకుంటున్నారు.బిగ్ బాస్ షోలో నాగ్ వెల్లడించిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.