ఈటెల, రేవంత్ రెడ్డి, రాజాసింగ్ లపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!!

బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ( KTR )ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు.ఇంక మూడు వారాలు మాత్రమే టైమ్ ఉండటంతో ఒకపక్క ప్రజలకు హామీలు ఇస్తూనే మరోపక్క ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు.

 Minister Ktr Sensational Comments On Etela Revanth Reddy Rajasingh , Telangana E-TeluguStop.com

తాజాగా మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిక్లరేషన్ పేరిట కుట్ర చేస్తుందని ఆరోపించారు.ఇక ఇదే సమయంలో వచ్చే ఎన్నికలలో ఈటెల, రేవంత్ రెడ్డి, రాజాసింగ్( Etela, Revanth Reddy, Rajasingh ) లను… ఈ ముగ్గురిని కచ్చితంగా ఓడిస్తామని స్పష్టం చేశారు.

త్వరలో జరగబోయే ఎన్నికలలో బీజేపీ( BJP ).దమ్ముంటే ఒక సీట్ అయినా గెలుచుకోమని బహిరంగంగా సవాల్ చేశారు.గోష్ మహాల్ నియోజకవర్గంలో కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగైనా సరే రాజాసింగ్ ను ఓడించి తీరుతామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో.అదేవిధంగా బీజేపీ నేత ఈటెల రాజేందర్ నీ హుజురాబాద్ లో ఓడిస్తామని అన్నారు.కాంగ్రెస్ పార్టీ టికెట్లను అమ్ముకుంటూ నాయకుల సెంటిమెంట్ తో ఆడుకుంటుందని మండిపడ్డారు.

జరగబోయే ఎన్నికలలో కచ్చితంగా బీఆర్ఎస్ , కాంగ్రెస్, బీజేపీ లను ఓడించి గెలుస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube