ఖమ్మం: వినాయక నిమజ్జన ఏర్పాట్లు పనులను పరిశీలించిన నగర మేయర్.రేపు 10 Sep 2022న గణేష్ నిమజ్జనం కొరకు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోగల కాల్వడ్డు సమీపం మున్నేరు, ప్రకాష్ నగర్ ప్రాంతాలలో గణేష్ విగ్రహాల నిమజ్జన ఘాట్ ల వద్ద ఏర్పాటు చేసిన పనులను మేయర్ నీరజ పరిశీలించారు.
శనివారం నగరంలో జరిగే శోభాయాత్ర లకు ట్రాఫిక్ పోలీసు వారు నిర్ణయించిన మార్గంలలో నిమజ్జనానికి విగ్రహాలను తీసుకురావాలని, నిమజ్జన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను గజ ఈతగాళ్లు, ఫ్డ్ లైట్ లు, ప్రధమ చికిత్స స్టాల్స్, గాంధీ చౌక్ కూడలిలో స్తంభాద్రి ఉత్సవ కమిటీ స్వాగత మండపం ఏర్పాటు చేయడం జరిగిందని, అందరూ భక్తిశ్రద్ధలతో జాగ్రత్తలు పాటిస్తూ శోభా యాత్రలో పాల్గొనాలని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో వారితోపాటు suda చైర్మన్ విజయ్ కుమార్, అడిషనల్ డి సి పి సుభాష్ చంద్రబోస్, టౌన్ ఏసిపి ఆంజనేయులు 24 వ డివిజన్ కార్పొరేటర్ కామర్తపు.
మురళి, టిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, DE శ్రీనివాస్, సీఐలు చిట్టి బాబు, సర్వయ్య, కన్నం ప్రసన్న కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.