గ్రామీణ ప్రాంత యువతలో శక్తివంతమైన సామర్ధ్యాలను వెలికి తీయడానికి,చేడు అలవాట్లవైపు దారిమల్లకుండా, మాధకద్రవ్యాల వినియోగం ద్వారా కలిగే అనర్థాల పట్ల యువతలో అవగాహన పెంపొందించడం కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయిలో దోస్తీ మీట్ – 2024 క్రీడా (కబడ్డీ, వాలీబాల్ ) పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ( SP Akhil Mahajan )పేర్కొన్నారు.ఈ మేరకు సోమావారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ( District Police Department ) ఆధ్వర్యంలో దోస్తీ మీట్ – 2024 లో భాగంగా గ్రామీణ ప్రాంత యువత శక్తిసామర్ధ్యాలను వెలికి తీయడానికి,యువత చేడు అలవాట్ల వైపు దారిమల్లకుండా, మాధకద్రవ్యాల వలన కలుగు అనార్దలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి ఈ నెల 23 తేదీ నుండి ప్రతి మండల కేంద్రాల్లో కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఆసక్తి గల యువతి, యువకులు తమ తమ జట్ల వివరాలు మీ పోలీస్ స్టేషన్ల పరిధిలో 22 వ తేదీ లోపు నమోదు చేసుకోవాలని, 23 వ తేది గురువారం నుండి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.ఈ పోటీలలో గెలుపొందిన జట్లకు తదుపరి జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతున్నారు.
దోస్తీ మీట్ 2024 క్రీడా పోటీలలో క్రీడాకారులు, యువతి , యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు.