భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి కన్నుమూత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కుంజా సత్యవతి కన్నుమూశారు.అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

 Former Bhadrachalam Mla Kunja Satyavathy Passes Away-TeluguStop.com

2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కుంజా సత్యవతి 2014 వరకు ఎమ్మెల్యేగా పని చేసిన సంగతి తెలిసిందే.కాగా రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

మరోవైపు సత్యవతి ఆకస్మక మరణంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు.అదేవిధంగా సమాచారం అందుకున్న ఎమ్మెల్యే పొదెం వీరయ్య సత్యవతి భౌతికకాయానికి నివాళులు అర్పించారు.

ఆమె మరణం ప్రజలకు తీరని లోటని ఆయన తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube