బుల్లితెర యాంకర్ రష్మీ జబర్దస్త్ షోకు యాంకర్ గా రాకముందు కొన్ని సినిమాలలో చిన్నచిన్న పాత్రలలో నటించారు.అయితే ఆ పాత్రలు రష్మీకి పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు.
అయితే జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరపై వచ్చిన క్రేజ్ వల్ల రష్మీ గౌతమ్ కు సినిమాలు, ఇతర టీవీ షోలలో ఆఫర్లతో పాటు ఈవెంట్లకు హోస్ట్ గా చేసే అవకాశం దక్కుతోంది.భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయకపోవడంతో దర్శకనిర్మాతలు సైతం రష్మీ గౌతమ్ కు ఆఫర్లు ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు.
తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ కాగా ప్రోమోలో మనో వేసిన పంచ్ లు వైరల్ అవుతున్నాయి.ఈ నెల 24వ తేదీన ప్రసారమవుతున్న ఎపిసోడ్ ప్రోమోలో రాకింగ్ రాకేష్ రష్మీతో కలిసి ఎంట్రీ ఇచ్చారు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలోని లెహరాయి పాటకు రష్మీతో కలిసి రాకేష్ స్టెప్పులు వేశారు.మనో పొద్దున క్యారవాన్ లో కాళ్లపై పడ్డావ్ డ్యాన్స్ కోసమా అని రాకేష్ ను అడుగుతూ పంచ్ వేశారు.
రష్మీ చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ ఆకట్టుకుంది.
మరోవైపు ఢీ షోకు రష్మీ యాంకర్ గా తప్పుకోవడంతో ఆ షో అభిమానులు బాధ పడుతున్నారు.
రష్మీ సుధీర్ కాంబో బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రష్మీ సుధీర్ జోడీని మరే జోడీ రీప్లేస్ చేయలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రష్మీ కి సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది.మూగజీవాల విషయంలో రష్మీ ఎంతో ప్రేమగా వ్యవహరిస్తారనే సంగతి తెలిసిందే.
మూగజీవులకు ఎలాంటి కష్టం వచ్చినా రష్మీ గౌతమ్ అస్సలు తట్టుకోలేరు.పలు సినిమాల్లో రష్మీ గౌతమ్ హీరోయిన్ గా నటించగా ఆ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.రష్మీ గౌతమ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండగా ఆమె నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది.