ఏపీలో మరో మంత్రి కరోనా బారిన పడ్డాడు.రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది.
గత కొంత కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాడు.రిపోర్టులో పాజిటివ్ అని తేలడంలో కుటుంబసభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేయించారు.
ఇప్పటికే రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు.వీరిలో మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆదిమూలపు సురేష్ కరోనా బారిన పడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.సోమవారం 56,490 మంది అనుమానితులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.వీరిలో 10,004 మందికి పాజిటివ్ వచ్చింది.దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,34,771కు చేరింది.
కేసుల పెరుగుదలతో పాటు మరణాల సంఖ్య కూడా అలానే నమోదవుతోంది.సోమవారం ఒక్కరోజే 85 మంది చనిపోయారు.
దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,969కి చేరింది.కేసులు పెరుగుతుండటంతో ప్రజాప్రతినిధుల్లో కరోనా భయం వెంటాడుతోంది.
ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడటంతో ప్రభుత్వం కరోనాతో జాగ్రత్తలు పాటించాలంది.పాజిటివ్ వచ్చిన వారికి సన్నిహితులుగా మెలిగిన వారు తప్పకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది.