ఢిల్లీ వార్ రూమ్ లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ..!!

ఢిల్లీ వార్ రూమ్ లో ఇవాళ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ జరగనుంది.ఈ మేరకు మధ్యాహ్నం స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో ఈ సమావేశం ఏర్పాటు కానుంది.

 Congress Screening Committee Meeting In Delhi War Room..!!-TeluguStop.com

ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు.ఇప్పటికే 50 శాతం అభ్యర్థుల ఎంపిక పూర్తి అయినట్లు తెలుస్తోంది.119 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపనుంది.ఈ క్రమంలో మొదటి విడతలో దాదాపు 60 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.

మరోవైపు అసెంబ్లీ సీట్ల కోసం ఢిల్లీలో కాంగ్రెస్ ఆశావహులు పడిగాపులు కాస్తున్న సంగతి తెలిసిందే.ఈ మేరకు అధిష్టానం పెద్దలను కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేతలు తమకు టికెట్లు ఇవ్వాలని ఒత్తిడి తీసుకురానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube