ఒకే తెరపై బాలయ్య-ప్రభాస్.. ఈ ప్రొడ్యూసర్ ప్లాన్ మామూలుగా లేదుగా?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ప్రభాస్ త్వరలోనే బాలకృష్ణతో కలిసి ఒకే తెరపై సందడి చేయనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

 Balayya Prabhas On The Same Screen Is This Producer Plan Is Not Normal, Prabhas,-TeluguStop.com

ఈ క్రమంలోనే బాలకృష్ణ ఆహా వేదికగా నిర్వహిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను ఎంతో సందడి చేస్తున్నారు.ఇప్పటికే ఈ కార్యక్రమానికి పలువురు స్టార్స్ హాజరయ్యే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ కార్యక్రమానికి త్వరలోనే ప్రభాస్ రానున్నట్లు తెలుస్తోంది.జనవరి 14వ తేదీ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రభాస్ ను ఈ కార్యక్రమానికి తీసుకురావడం కోసం అల్లుఅరవింద్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu Balakrishna, Heroes, Stage, Prabhas, Tollywood-Movie

ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రభాస్ బాలకృష్ణ ఇలా ఒకే వేదికపై కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.సాధారణంగా ప్రభాస్ ఈ విధమైనటువంటి షోలకు రావడానికి ఆసక్తి చూపరు అనే విషయం మనకు తెలిసిందే.ఇదివరకే ప్రభాస్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమానికి ఆహ్వానించిన అందులో పాల్గొనడానికి ఈ బాహుబలి ఆసక్తి కనబరచలేదు.మరి ఈ కార్యక్రమానికైనా వస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube