1.బీహార్ సీఎంతో కేసీఆర్ భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు బీహార్ లో పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ తో భేటీ కానున్నారు.
2.ట్రాఫిక్ ఆంక్షలు
ఖైరతాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.
3.కేంద్ర క్యాబినెట్ సమావేశం

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది.
4.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 7,231 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
5.ఫెన్సింగ్ క్రీడాకారిణి బేబీ రెడ్డి కి జగన్ అభినందన

అంతర్జాతీయ ఫెన్సింగ్ క్రీడాకారిని మురికినాటి బేబి రెడ్డిని ఏపీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో అభినందించారు.
6.పాట్నాలో చెక్కులు పంపిణీ చేసిన కేసీఆర్
గాల్వాన్ అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం అందించారు.ఈ మేరకు పాట్నా లో జరిగిన కార్యక్రమంలో కెసిఆర్ అమరవీరుల కుటుంబ సభ్యులకు ఈ సాయాన్ని అందించారు.
7.అపోలో ఆసుపత్రికి బండి సంజయ్

జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లారు.కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై చికిత్స పొందుతున్న మహిళలను ఆయన పరామర్శించారు.
8.ఇబ్రహీంపట్నం ఘటనపై హరీష్ రావు స్పందన
ఇబ్రహీంపట్నం ఘటనపై తెలంగాణ మంత్రి హరీష్ రావు స్పందించారు.కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన డాక్టర్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు , ఆసుపత్రి సూపరింటెండెంట్ ను చేసినట్లు ప్రకటించారు.
9.కేసీఆర్ , హరీష్ పై రేవంత్ రెడ్డి ఆగ్రహం

ఇబ్రహీం ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు.మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలను రేవంత్ ఆదేశించారు.హెల్త్ మినిస్టర్ హరీష్ రావును క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని , మామ అల్లుళ్లు మహిళా హంతకులు అంటూ కెసిఆర్ హరీష్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు.
10.వరంగల్ లో మావోయిస్టుల లేఖ కలకలం
వరంగల్ జిల్లాలో మావోయిస్టుల లేక కలకలం రేపుతోంది. విప్లవిజాన్ని నిర్మూలించడానికి పోలీసులు ఇచ్చే డబ్బుకి ఆశపడి వ్యాపారస్తులు ఇన్ ఫార్మర్లుగా మారొద్దంటూ లేఖ విడుదల చేశారు.
11.సికింద్రాబాద్ తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వికారాబాద్ గుంతకల్ మీదుగా సికింద్రాబాద్ తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్ల ను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
12.గ్రేటర్ లో ఎలక్ట్రిక్ బస్సులు
గ్రేటర్లు ఎలక్ట్రిక్ బస్సులు పెంచుకునే దిశగా ఆర్టీసీ ప్రయత్నిస్తూ డిసెంబర్ నాటికి 100 ఎలక్ట్రిక్ బస్సులను మేడపాలని నిర్ణయించుకుంది.
13.టిఆర్ఎస్ ఎల్ఫీ సమావేశం

సెప్టెంబర్ మూడవ తేదీన టిఆర్ఎస్ సెల్ఫీ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది.
14.షర్మిల కామెంట్స్
అసమర్ధ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైందని టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశించి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
15.ఏపీ మహేష్ బ్యాంక్ డైరెక్టర్లకు జైలు

కోర్టు ధిక్కరణ నేరం రోజు కావడంతో హైదరాబాదులోని ఏపీ మహేష్ బ్యాంక్ ఎండి సీఈవోతో సహా 11 మందికి హైకోర్టు జైలు శిక్ష విధించింది.
16.మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తాం
బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
17.నేడు పిఎం కిసాన్ నమోదుకు చివరి తేదీ

ప్రధానమంత్రి కిసాన్ సామాన్ నిధికి దరఖాస్తు చేసుకోవడానికి నేటితో గడువు ముగియనుంది.
18. వానాకాలం సీఎంఆర్ గడువు పొడగింపు
గత వానకాలం సీజన్ కు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ గడువును కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
19.గవర్నర్ సీఎం వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ డాక్టర్ తమిళ సై , తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,000
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,270