1.పవన్ చంద్రబాబులపై రోజా కామెంట్స్

టిడిపి అధినేత చంద్రబాబు ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు చేశారు.విద్య దీవెన తో చంద్రబాబు పవన్ లకు మంచి చదువు చెప్పించాలని ఆమె సెటైర్లు వేశారు.
2.పురందేశ్వరిపై విజయసాయి సెటైర్లు
ఒక్క క్షణం ఆలోచించమ్మా అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరిని ఉద్దేశించి వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు ఈరోజు ఎన్టీఆర్ పేరుతో 100 రూపాయల నాణేన్ని కేంద్రం విడుదల చేస్తున్న నేపథ్యంలో లక్ష్మీపార్వతికి ఆహ్వానం పంపించకపోవడంపై స్పందించిన ఆయన పురందరేశ్వరికి అనేక ప్రశ్నలు సంధించారు.
3.ఎన్టీఆర్ ₹100 నాణెం విడుదల

భారత రాష్ట్రపతి ద్రౌపది మూర్ము చేతుల మీదగా దివంగత ఎన్టీఆర్ వంద రూపాయలు స్మార్ట్ నాణ్యాన్ని విడుదల చేశారు.
4.గణపతి ఉత్సవాల నిర్వహణపై సమావేశం
గణపతి ఉత్సవాల నిర్వహణపై నేడు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సమావేశం జరగనుంది.దీనికి మంత్రులు అధికారులు హాజరుకానున్నారు.
5.కృష్ణ భూమి దగ్గర నిర్మాణాలపై నేడు విచారణ

కృష్ణ భూమి దగ్గర నిర్మాణాలపై నేడు సుప్రీం లో విచారణ జరగనుంది.
6.కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టిడిపి వైసిపి
నేడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసిపి టిడిపిలు కలవనున్నాయి.ఓటర్ల జాబితాలో అవకతలపై రెండు పార్టీలు ఫిర్యాదు చేయనున్నాయి.
7.నేడు రాజమండ్రి కి లక్ష్మీపార్వతి

తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి నేడు రాజమండ్రి కి రానున్నారు.
8.వేములవాడ రాజన్న ఆలయంలో…
వేములవాడ రాజన్న ఆలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు.
9.లోకేష్ పై మంత్రి విమర్శలు

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ఏపీ మంత్రి కారుమురి నాగేశ్వరావు విమర్శలు చేశారు.లోకేష్ అసలు మనిషేనా అంటూ మండిపడ్డారు.
10.తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత
తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కింది.అలిపిరి కాలి నడక మార్గంలో ఏడో మైలు రాయి వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుతను ట్రాప్ చేసినట్లు టిటిడి అధికారులు తెలిపారు.
11.ఏపీ ఎన్నికల అధికారికి అచ్చెన్న లేఖ

ఏపీ ఎన్నికల అధికారి ముఖేష్ మేనకు టిడిపి ఏపీ అధ్యక్షుడు లేక రాశారు.ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా తాడికొండలో ఓటర్ల జాబితా తయారు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
12.కెసిఆర్ పై రేవంత్ విమర్శలు
దళిత డెకరేషన్ పై అధికార పార్టీ చేస్తున్న విమర్శలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.కాంగ్రెస్ డిక్లరేషన్ దళితుడని సీఎం చేస్తారని మోసగించడం లాంటిది కాదు అని కేసిఆర్ పై సెటైర్లు వేశారు.
13.కాంగ్రెస్ పై ఎమ్మెల్సీ కవిత విమర్శలు

కాంగ్రెస్ పార్టీ దళితుల మీద ఎక్కడలేని ప్రేమ వలక పోస్తోందని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.
14 కేటీఆర్ సెటైర్లు
కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు .అది డిక్లరేషన్ సభ కాదని కాంగ్రెస్ ప్రస్టేషన్ సభ అంటూ కేటీఆర్ విమర్శించారు.
15.అమిత్ షాకు హరీష్ రావు కౌంటర్

మాకు నూకలు చల్లడం కాదు .రాబోయే ఎన్నికల్లో మీరు మాజీ లు అవుతారు అని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తెలంగాణ మంత్రి హరీష్ రావు కౌంటర్ వేశారు.
16.బండి సంజయ్ కామెంట్స్
మోసాలు చేయడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పీహెచ్డీ చేశారని కరీంనగర్ ఎంపీ మాజీ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు
17.కుల వివక్ష పై సర్వే జరగాలి

జన గణనకు పదేళ్లకు ఒకసారి సర్వే చేస్తున్నట్లుగానే అంటరానితనం కుల వ్యవక్షపైన ఐదేళ్లకు ఒకసారి సర్వే చేయాలని యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సుక్ దేవ్ తోరట్ అన్నారు.
18.తెలంగాణలో చికాగో తరహా ఫుడ్ స్టాప్
శతకో ఫుడ్ ఇన్నోవేషన్ ఈకో సిస్టం లాంటి వ్యవస్థను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.
19.సిబ్బందికి ఆర్టీసీ నుంచి ఆగస్టు వేతనాలు

విలీన ప్రక్రియ పూర్తికానందున ఆర్టీసీ ఉద్యోగులకు ఆగస్టు నెల వేతనాలను ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
20.కాపు కార్పొరేషన్ పెట్టాలి
ఐదువేల కోట్లతో కాపు కార్పొరేషన్ పెట్టాలని తెలంగాణలోని మున్నూరు కాపుల ప్లీనరీ సన్నాహక భేటీలో తీర్మానించారు.