టాలీవుడ్లో చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ వైవిధ్యమైన కంటెంట్ కలిగి ఉండటంతో ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది.ఈ సినిమాతో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి అదిరిపోయే సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పాలి.
ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయంతో ఇతర భాషల్లోకి ఈ సినిమాను రీమేక్ చేయాలని చిత్ర వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.ఇందులో భాగంగా బాలీవుడ్లో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయినట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ను ఏకంగా రూ.2 కోట్లకు కొనుగోలు చేశారట అక్కడి దర్శకనిర్మాతలు.ఇలాంటి చిన్న సినిమాకు ఇది భారీ డీల్ అనే చెప్పాలి.ఏదేమైనా ప్రస్తుతం తెలుగు సినిమాలను వరుసగా రీమేక్ చేస్తున్న బాలీవుడ్ నిర్మాతలు, కంటెంట్తో మెప్పించిన సినిమాలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇక ఈ సినిమాతో హీరోగా అదరగొట్టిన నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం ‘జాతి రత్నాలు’ అనే సినిమాలో నటిస్తున్నాడు.ఈ హీరో బాలీవుడ్లోనూ ‘చిచ్చోరే’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.
మరి బాలీవుడ్లో ఏజెంట్ ఆత్రేయగా ఎవరు నటిస్తున్నారనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.ఇప్పటికే జెర్సీ చిత్రం అక్కడ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.