మన సినిమా ఇండస్ట్రీలో బహుముఖ ప్రజ్ఞాశాలులకు కొదువే లేదు.కొంతమంది హీరో, హీరోయిన్లు అప్పుడప్పుడు సింగర్స్ గా మారి పాటలు పాడతారు, లారెన్స్ అయితే కోరియోగ్రాఫితో మొదలుపెట్టి, నటన,సంగీతం,దర్శకత్వం … ఇలా ఏది వదలలేదు.
మన దేవీశ్రీప్రసాద్ కూడా తక్కువేం తినలేదు.
కేవలం సంగీత దర్శకుడిగానే పరిమితం అవకుండా, మాంచి హిట్ పాటలు రాసిన అనుభవం కుడా ఉంది.
ఇప్పుడు దేవిశ్రీ మరో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు.కుమారి 21 ఎఫ్ సినిమా తెలుసుగా.
ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మిస్తున్న ‘కుమారి 21 ఎఫ్’ సినిమాలో రాజ్ తరుణ్, హేభ పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.కథ స్క్రీన్ ప్లే మాటలు సుకుమార్ అందిస్తుండగా, ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ చిత్రంలో తానే కంపోజ్ చేసిన ఓ పాటకు దేవిశ్రీ నృత్యదర్శకత్వం వహించనున్నాడు.
మ్యూజిక్ డైరెక్టర్ గా, గీత రచయితగా మనల్ని అలరించిన దేవిశ్రీ ఇప్పుడు కొరియోగ్రాఫర్ గా ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.