కర్నూలు జిల్లా ఆలూరు సభలో సీఎం జగన్ పై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) కర్నూలు జిల్లా( Kurnool District ) ఆలూరులో “ప్రజాగళం” నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పై( CM Jagan ) సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

 Chandrababu Serious Comments On Cm Jagan In Alur Sabha Of Kurnool District Detai-TeluguStop.com

జగన్ లాంటి వ్యక్తి కన్నతల్లికి, జన్మభూమికి భారమని ఎద్దేవా చేశారు.ఏపీలో అత్యంత డబ్బు ఉన్న వ్యక్తి జగన్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

జగన్ మాటలకు చేతలకు చాలా తేడా ఉంటుందని విమర్శించారు.ఐదేళ్లు అధికారమిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు.

అన్ని రంగాలను వ్యవస్థలను ధ్వంసం చేశారని మండిపడ్డారు.జగన్ ఐదేళ్ల పాలనలో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితికి ఆర్థిక వ్యవస్థను తీసుకువచ్చారని ఆరోపించారు.వైసీపీని( YCP ) చిత్తుచిత్తుగా ఓడించేందుకు పొత్తు పెట్టుకున్నామని తెలిపారు.కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ కూటమి( NDA Alliance ) అని.కేంద్ర సహకారం రాష్ట్రానికి అవసరమని చంద్రబాబు సంచలన స్పీచ్ ఇచ్చారు.ఏపీలో ఎన్నికలకు ఇంకా పాతిక రోజులు మాత్రమే సమయం ఉంది.ఆల్రెడీ నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది.2024 ఎన్నికలలో కచ్చితంగా గెలవాలని చంద్రబాబు పక్క వ్యూహాలతో నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది.

గతంలో 2014లో ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారంలోకి రావడం జరిగాయి.ఈసారి కూడా ఆ తరహాలోనే విజయం సాధించాలని చంద్రబాబు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube