నేడు భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా( South Africa ) మధ్య రెండవ వన్డే మ్యాచ్ జరగనుంది.తొలి మ్యాచ్లో అద్భుతమైన ఫామ్ కొనసాగించిన కేఎల్ రాహుల్ సేన, రెండవ మ్యాచ్ లో కూడా అదే దూకుడు కొనసాగించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
ఇక దక్షిణాఫ్రికా జట్టు ఎలాగైనా నేడు జరిగే మ్యాచ్లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని అనుకుంటుంది.
అయితే నేడు జరిగే మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.కాబట్టి నేడు జరిగే మ్యాచ్ కు వరుణుడు కరుణిస్తాడో లేదంటే అడ్డగిస్తాడో.ఒకవేళ నేడు జరిగే మ్యాచ్ రద్దు అయితే మూడో మ్యాచ్లో భారత్ గెలిస్తే సిరీస్ భారత్ కు దక్కుతుంది లేదంటే సిరీస్ సమం అవుతుంది.
ఇక నేడు జరిగే మ్యాచ్ విషయానికి వస్తే.తొలి మ్యాచ్లో అద్భుతమైన ఆటను ప్రదర్శించిన శ్రేయస్ అయ్యర్( Shreyas Iyer ) ఈ మ్యాచ్ కు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నేటి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ స్థానంలో రింకూ సింగ్( Rinku Singh ) ఆడే అవకాశం ఉంది.
భారత జట్టు ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్ బరిలోకి దిగుతారు.ఆ తర్వాత వరుసగా రింకూ సింగ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ బరిలోకి దిగుతారు.ఇక భారత జట్టు బౌలింగ్ పరంగా ఎంత పటిష్టంగా ఉందో తొలి మ్యాచ్ ను బట్టి తెలుస్తోంది.
భారత జట్టు పేసర్లు అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్ తోపాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav ) చాలా చక్కగా రాణిస్తున్నారు.కాబట్టి ఈ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ భారత్ కు దక్కే అవకాశాలే చాలా ఎక్కువ.