సుకుమార్ ( Sukumar ) దర్శకత్వంలో అల్లు అర్జున్, ( Allu Arjun ) రష్మీక( Rashmika )హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప( Pushpa ) సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఆదరణ పొందినదో మనకు తెలిసిందే.ఈ సినిమా ద్వారా రష్మిక అల్లు అర్జున్ ఇద్దరు కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక ఈ సినిమా ద్వారా ఈమెకు బాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నాయి.ప్రస్తుతం వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే డైరెక్టర్ సందీప్ రెడ్డి( Sandeep Reddy ) వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్(Ranbir Kapoor) తో కలిసి ఈమె నటించిన తాజా చిత్రం యానిమాల్( Animal ).
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం బాలకృష్ణ ( Balakrishna ) టాక్ షోకు ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ రష్మికను ప్రశ్నిస్తూ పుష్ప 2(Pushpa 2)సినిమా గురించి చెప్పమని అడగడంతో ఈమె చెప్పను అంటూ తల ఊపారు ఇక రణబీర్ కపూర్ మాత్రం పుష్ప 2 సినిమా స్టోరీ గురించి అసలు విషయం బయట పెట్టారు.
నేను సందీప్ రెడ్డి గారు షూటింగ్ లొకేషన్లో ఉన్నప్పుడు పుష్ప 2 స్టోరీ ఏమై ఉంటుంది అంటూ మాకు మేము ఎన్నో ఊహించుకొని కథలుగా రాసుకునే వాళ్ళం అంటూ రణబీర్ తెలిపారు.పుష్ప 2 సినిమాలో శ్రీవల్లి ప్రెగ్నెంట్ అయినప్పుడు చనిపోతుందని దాంతో పుష్పరాజ్ రివేంజ్ తీర్చుకోబోతారని ఇక పుష్పరాజ్ ప్రాణ స్నేహితులకు కేశవ కూడా చనిపోతారు అంటూ మా అంతట మేము ఎన్నో ఊహగానాలు కథలు రాసుకునే వాళ్ళం అంటూ వారు ఊహించుకున్నటువంటి పుష్ప 2 గురించి ఈ సందర్భంగా రణబీర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇలా రణబీర్ చేసిన కామెంట్స్ కనుక చూస్తే పుష్పట్టు సినిమా కోసం వీళ్ళు కూడా ఎంత ఎదురుచూస్తున్నారో అర్థం అవుతుంది.