పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఓసీపీ రెండో గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఈ క్రమంలో సింగరేణి ప్రాజెక్టు కార్యాలయాన్ని లద్నాపూర్ గ్రామస్తులు ముట్టడించారు.
లద్నాపూర్ గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహం మాయం అయిందంటూ ఆందోళనకు దిగారు.తమ గ్రామంలోని పోచమ్మ తల్లి విగ్రహాన్ని సింగరేణి అధికారులే తీసుకెళ్లారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
అర్ధరాత్రి సమయంలో పూజలు నిర్వహించి గుడిలో ఉన్న విగ్రహాన్ని తీసుకెళ్లారని గ్రామస్థులు మండిపడుతున్నారు.ఈ క్రమంలోనే సింగరేణి ఓపీసీ రెండో గేటు వద్ద గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
దీంతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.