ఈ మధ్యకాలంలో చాలామంది ప్రేమించుకుని, కొంతకాలం రిలేషన్ లో ఉండి మరీ పెళ్లి చేసుకుంటున్నారు.కానీ పెళ్లి జరిగిన తర్వాత వారి అసలు రూపాన్ని బయటపడుతున్నారు.
భార్యను తనతో అసహజ శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేశాడు ఒక ఎన్నారై.దానికి నిరాకరించడంతో ఆమెకు విడాకులు ఇచ్చాడు.
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ కు చెందిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
వివరాలు ఇలా ఉన్నాయి.2016 అక్టోబర్ 24న బెంగళూరులోని ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా బాధితురాలికి ఆమె భర్త పరిచయం ఏర్పడిందని సమాచారం.ఆ తర్వాత ఇద్దరూ నెంబర్లు ఒకరికొకరు మార్చుకొని ఫ్రెండ్స్ అయ్యారు.
ఈ ఫ్రెండ్షిప్ కాస్త కొంతకాలానికి ప్రేమగా మారిపోయింది.చివరికి డేటింగ్ మొదలుపెట్టి తర్వాత రెండేళ్ల పాటు రిలేషన్ లో ఉండి ఆ తర్వాత 2019 ఫిబ్రవరిలో వారు పెళ్లి చేసుకున్నారు.
ఇక వివాహమైన తర్వాత అత్తమామలు తన రూపాన్ని బట్టి తిట్టడం, వేధించడం మొదలుపెట్టారని బాధితురాలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.అదే సమయంలో తన భర్త తనతో అసహజ శృంగారానికి ప్రయత్నించాడనీ దానికి తను అంగీకరించని ప్రతిసారి తనకు విడాకులు ఇస్తానని బెదిరించేవాడని ఆమె తన ఫిర్యాదులో వెల్లడించింది.
ఈ క్రమంలో గత సంవత్సరం ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వెల్స్ కు ఈ జెంట వెళ్ళింది.అక్కడికి వెళ్లిన మూడు నెలల తర్వాత మళ్లీ అసహజ శృంగారానికి భర్త పట్టుపట్టాడు కానీ ఆమె దానికి అంగీకరించలేదు.
దీనివల్ల భర్త కోపంతో తనను చితకబాదాడని ఆమె ఫిర్యాదులో వెల్లడించింది.ఆ తర్వాత అతను వదిలేసి స్పాన్సర్షిప్ ను ఉపసంహరించుకున్నాడని వెల్లడించింది.ఆ తర్వాత 2022 జులై 30న ఆమెకు భర్త విడాకుల నోటీసు పంపాడు.అయితే ఆమె భారత రాయబార కార్యాలయం సహాయంతో గుజరాత్ కు తిరిగి వచ్చేసింది.
కూతురు బాద చూడలేక ఆమె తల్లిదండ్రులు భర్త పై ఫిర్యాదు చేయించారు.భర్త తనపై గృహింసకు పాల్పడ్డాడని, అసహజ శృంగారానికి నిరాకరించడంతో తనకు విడాకులు అడుగుతున్నాడని ఆమె సాటిలైట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఆమె పిర్యాదు మేరకు గృహింస కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.