ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా ఎంతో పేరు సంపాదించుకొని వరుస సినిమా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
గత రెండు సంవత్సరాలలోనే దాదాపు ఎన్నో సినిమాలకు సంగీతం అందించి సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇకపోతే తాజాగా ఈయన సంగీతం అందించిన అలా వైకుంఠపురం సినిమాకి గాను జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు గెలుచుకోవడం విశేషం.
ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తన చిన్నప్పటి ఫోటోని షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తమన్ అతి చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోయి చదువుపై దృష్టి పెట్టకుండా తనకు సంగీతం అంటే ఇష్టం కావడంతో సంగీతం వైపు దృష్టి పెట్టారు.అతి చిన్న వయసులోనే ఈయన డ్రమ్మర్ గా తన జీవితాన్ని మొదలుపెట్టి అంచలంచెలుగా ఎదుగుతూ నేడు ఈ స్థాయిలో ఉన్నారు.
తల్లిదండ్రులు ఇద్దరు కూడా సంగీత నేపథ్యం ఉండడంతో ఈయన కూడా సంగీతం వైపే మక్కువ చూపి ఇలా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా స్థిరపడ్డారు.
ఎస్ ఎస్ తమన్ తన కెరియర్ లో మొదటిసారిగా భైరవద్వీపం సినిమాకు డ్రమ్మర్ గా పనిచేశారు.ఈయన 1993 జూలై 25 వ ఐదవ తేదీ మాధవ పెద్ది సురేష్ సంగీత దర్శకత్వంలో తెరికెక్కిన భైరవద్వీపం సినిమాకి పనిచేశారు ఈ సినిమాకి పని చేసినందుకు గాను తమన్ తన తొలి రెమ్యునరేషన్ గా 30 రూపాయలు అందుకున్నట్లు తెలిపారు.అయితే ఈయన తన సినీ కెరియర్ లోకి నేడు అడుగుపెట్టిన రోజు కావడంతో ఈరోజు తన జీవితంలో ఎంతో ప్రత్యేక అంటూ ఈయన ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.