దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలోనే అగ్రనటిగా గుర్తింపు సంపాదించుకున్న నటి రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.కేవలం దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ చిత్రాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరుస బాలీవుడ్ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏకంగా మూడు సినిమాలకు కమిట్ అయ్యి ఆ సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ అనే చిత్రంలో నటిస్తున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఇక ఈ సినిమాలో హీరో రణబీర్ కపూర్ గురించి మాట్లాడుతూ ఆయన చాలా మంచి వ్యక్తి అని వెల్లడించారు.
మొదటిసారి అతనిని కలిసినప్పుడు చాలా నెర్వస్ గా అనిపించిందని , అయితే అతనితో మాట్లాడిన 5 నిమిషాలకే ఆ భయం మొత్తం పోయిందని తెలిపారు.
ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో తనని రణబీర్ కపూర్ మాత్రమే మేడమ్ అని పిలుస్తారని, అతను తనని మేడం అని పిలవడం తనకు ఏమాత్రం నచ్చలేదని రష్మిక తెలియజేశారు.ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది.ఇక తెలుగు సినిమాలకు విషయానికి వస్తే ఈమె పుష్ప 2 చిత్రంలో నటించనున్నారు.
అదే విధంగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 66 లో రష్మిక నటించనున్నారు.