తెలుగు చిత్ర పరిశ్రమలో నటసార్వభౌముడుగా తిరుగులేని హీరోగా ప్రస్థానాన్ని కొనసాగించారు సీనియర్ ఎన్టీఆర్. అయితే ఇక అప్పట్లో సినిమాల రెమ్యూనరేషన్ విషయంలో కూడా నందమూరి తారక రామారావు తర్వాత ఎవరికైనా.
ఎందుకంటే ఇక అతి ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా కూడా కొనసాగారు ఎన్టీఆర్.ఎన్టీఆర్ తో పోలిస్తే మిగతా హీరోలు కాస్త రెమ్యునరేషన్ తక్కువగానే ఉంటుంది.
అయితే సాధారణంగా ఒక సినిమాలో హీరో హీరోయిన్లు విలన్లు కీలక పాత్రధారులు చాలానే ఉంటాయి.అయితే ముందుగా ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకునేది మాత్రం హీరోలు అని చెప్పాలి.
ఆ తర్వాత హీరోయిన్లు ఇక ఆ తర్వాత విలన్ పాత్రలో నటించే వారు రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉంటారు.
కానీ హీరోలకు మించిన రెమ్యూనరేషన్ హీరోయిన్ తీసుకోవడం అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది.
కానీ అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటు ఉండగా ఇక ఒకానొక సమయంలో ఏకంగా సీనియర్ ఎన్టీఆర్ ను మించి ఇద్దరు హీరోయిన్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారు అన్న విషయం మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు.ఒకానొక సమయంలో హీరో ఎన్టీఆర్ కంటే ఇక హీరోయిన్ భానుమతి కాస్త ఎక్కువగానే పారితోషికం తీసుకున్నారట.
ఇండస్ట్రీలో ఉన్న సావిత్రి రాజసులోచన లాంటి హీరోయిన్లు అన్నగారి కంటే తక్కువగానే పారితోషికం తీసుకునే వారు.
కానీ అంజలి, భానుమతి మాత్రం ఇక తమ పారితోషికం ఎంత అన్న విషయాన్ని తామే స్వయంగా నిర్ణయించారట.1966లో వచ్చిన పల్నాటి యుద్ధం సినిమా లో అన్నగారి రెమ్యూనరేషన్ 5,000 ఇక ఇప్పటి తో పోలిస్తే ఒక రకంగా 10 కోట్లు అనొచ్చు.ఇదే సినిమాలో భానుమతి రెమ్యునరేషన్ మాత్రం 6000.
ఇక ఈ విషయం కొన్నాళ్ల తర్వాత అన్న గారికి తెలియడంతో నిర్మాతను ప్రశ్నించారట.
ఇదేం సాంప్రదాయ మమ్మల్ని తక్కువ చేస్తారా అని అడగడంతో ఇక అన్న గారి పరిస్థితి అర్థం చేసుకుని మరో వంద రూపాయలు అన్నగారు చేతిలో పెట్టాడట నిర్మాత.తరువాత ఎన్టీఆర్ కూడా ఎప్పటికప్పుడు మార్కెట్ మారుస్తూ పారితోషికం పెంచుతూ వచ్చారు.అచ్చం ఇలాగే అంజలి కూడా అన్న గారి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసేవారట అప్పట్లో.