దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.
ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 25న రిలీజ్ కానుందని ప్రకటించడంతో అందరు హ్యాపీ గా ఉన్నారు.
తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడం భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అన్ని చోట్ల జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.తాజాగా నిన్న రాత్రి ఈ సినిమా ప్రొమోషనల్ ఈవెంట్ ఢీల్లీ లో జరిగింది.
ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా అమీర్ ఖాన్ విచ్చేసారు.ఈయన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి స్టేజ్ మీద సందడి చేశారు.
ఇక ఈ ఈవెంట్ అయిపోవడంతో మళ్ళీ కొత్త ప్రమోషన్స్ కోసం స్టార్ట్ అయ్యారు టీమ్.
తాజాగా టీమ్ మోత అమృత్ సర్ లోని డివైన్ గోల్డెన్ టెంపుల్ ను సందర్శించారు.
అక్కడ అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం.పెద్ద సరస్సు మధ్య ఉన్న గుడి ఎంతో వైవిధ్యంగా ఉంటుంది.
సరిగ్గా అక్కడే చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి తెలుపు వర్ణం దుస్తులు ధరించి తలకి కర్చీఫ్ కట్టి దేవుడికి నమస్కరిస్తున్న ఫోటో రివీల్ చేసారు.ఈ ఫోటో ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టు కుంటుంది.
అసలు ఈ సందర్శనానికి తారక్ వెళ్లడం ఇష్టంలేదట.ఆయనకు కాస్త ఒంట్లో బాగోక పోవడంతో చరణ్, రాజమౌళి ని వెళ్లి వచ్చేయమని చెప్పిన కూడా వారు ఒప్పుకోలేదు.దీంతో ఆయన కూడా వారి వెంట వచ్చాడు.దీంతో స్వర్ణ దేవాలయం సందర్శించుకునే అవకాశం వచ్చింది.మన టీమ్ అంతా గుజరాత్ లో ఆదివారం ల్యాండ్ అయిన దగ్గర నుండి ప్రొమోషన్స్ అదర గొడుతుంది.