టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస ఆఫర్ లతో బాగా బిజీగా ఉన్నాడు.ఇప్పటికే పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సర్కార్ వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమా గతంలో కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడగా ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉంది.
ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా ఉన్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా నుండి ఓ బ్యాక్ డ్రాప్ తో రానుందని తెలుస్తుంది.
![Telugu Keerhisuresh, Mahesh Babu, Ss Rajmouli, Trivikram-Movie Telugu Keerhisuresh, Mahesh Babu, Ss Rajmouli, Trivikram-Movie](https://telugustop.com/wp-content/uploads/2021/07/ss-rajmouli-mahesh-babu-sarkaru-vari-pata-rrrlatest-newsmovie.jpg )
అంతేకాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా ఓ సినిమా చేయనున్నాడు మహేష్ బాబు.ఇక త్రివిక్రమ్ తో సినిమా అంటే ఫ్యాన్స్ పండగనే చెప్పవచ్చు.వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు మంచి సక్సెస్ ను అందించాయి.అంతేకాకుండా మరో సినిమా హారిక హాసిని క్రియేషన్స్ లో ఉందని తెలుస్తుంది.ఇక క్రేజీ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న సినిమా మల్టీ స్టార్లతో ఉందని గతంలో ప్రకటించారు.ఇక ఈ సినిమా ఆఫ్రికా అడవిలో నేపథ్యంలో ఉంటుందని తెలియగా ఈ సినీ నిర్మాత నారాయణ ఈ నేపథ్యంలో ఉండదని తెలిపాడు.
![Telugu Keerhisuresh, Mahesh Babu, Ss Rajmouli, Trivikram-Movie Telugu Keerhisuresh, Mahesh Babu, Ss Rajmouli, Trivikram-Movie](https://telugustop.com/wp-content/uploads/2021/07/ss-rajmouli-mahesh-babu-sarkaru-vari-pata-rrrlatest-news.jpg )
ఇక తాజాగా రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథ రాస్తున్నాడని అందులో ఆఫ్రికా అడుగుల బ్యాక్ డ్రాప్ ఉంటుందని తెలిపారు.ఇక ఈ సినిమా కథ ఇంకా సిద్ధం కాలేదని కథ గురించి ఇంకా చర్చ జరుగుతుందని విజయేంద్ర తెలిపాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా రెండు రకాల కథ మీద పనిచేస్తుందట.అందులో ఒకటి ఆఫ్రికా అడవుల్లో నేపథ్యంలో ఉండగా మరొకటి త్వరలోనే నిర్ణయిస్తామని విజయేంద్ర తెలిపాడు.
ఇక మొత్తానికి ఈ సినిమాలో మహేష్ బాబు రఫ్ గా కనిపిస్తాడని టాక్.ప్రస్తుతం రాజమౌళి పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు సినిమాను మొదలు పెట్టనున్నాడు రాజమౌళి.