17 మిలియన్ డాలర్ల రుణానికి సంబంధించి బ్యాంకును మోసం చేసినట్లు న్యూజెర్సీలో భారత సంతతికి చెందిన గ్రానైట్ వ్యాపారి తన నేరాన్ని అంగీకరించాడు.61 ఏళ్ల రాజేంద్ర కంకరియా బ్యాంక్ను ప్రభావితం చేసేలా ఉద్దేశ్యపూర్వకంగా నేరానికి పాల్పడినట్లు యూఎస్ జిల్లా జడ్జి సుసాన్ డి.విగెంటన్ ముందు తన తప్పును అంగీకరించాడు.నేరం రుజువైనందున శిక్షగా అతను గరిష్టంగా 30 సంవత్సరాల జైలు శిక్ష, 1 మిలియన్ డాలర్ల జరిమానాకు గురయ్యే అవకాశం వుంది.
వచ్చే ఏడాది జనవరి 18న న్యాయస్థానం అతనికి శిక్ష ఖరారు చేయనుంది.మార్చి 2016 నుంచి మార్చి 2018 మధ్యకాలంలో లోటస్ ఎక్సిమ్ ఇంటర్నేషనల్ ఇంక్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కంకరియా ఇతర ఉద్యోగులతో కలిసి 17 మిలియన్ల రుణం పొందడానికి పక్కా ప్రణాళికను అమలు చేశారు.
రుణానికి హామీ ఇచ్చేందుకు తగినన్ని స్థిరాస్థులు లేని నేపథ్యంలో కంకారియ వద్ద పనిచేసే ఉద్యోగులే తమ వినియోగదారుల పేరు మీద నకిలీ ఈ మెయిల్ ఖాతాలను తెరిచారు.
ఎల్ఈఐ సంస్థను గురించి బ్యాంక్, ఆడిట్లరకు తాము లోటస్ సంస్థకు భారీ మొత్తాలు బకాయి ఉన్నామని, త్వరలోనే చెల్లిస్తామని సమాచారం ఇచ్చారు.
దీనిని నిజమని భావించిన బ్యాంక్.కంకారియా సంస్థకు రుణాలు మంజూరు చేసింది.ఈ కుంభకోణానికి సంబంధించి బ్యాంక్కు 17 మిలియన్ డాలర్ల నష్టం సంభవించిందని న్యాయస్థానంలో రుజువైంది.