ఆ విషయంలో ససేమిరా అంటోన్న రఘువరన్..?

తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జగమే తాంద్రిరం’పై తమిళ వర్గాల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఈ సినిమాతో మరోసారి ధనుష్ తనదైన మార్క్ వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.

 Dhanush Says No To Ott Release Of His Next Film, Dhanush, Ott, Jagame Thandhrira-TeluguStop.com

కాగా ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో చిత్ర యూనిట్ అయోమయంలో పడింది.

కాగా ప్రస్తుతం ఓటీటీల హవా సాగుతోండటంతో ఈ సినిమాను కూడా అదే బాటలో రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు.కానీ ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో థియేటర్లలోనే రిలీజ్ చేయాలని హీరో ధనుష్ అంటున్నాడు.

ఎంత ఆలస్యమైనా సరే ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలంటూ ధనుష్ పట్టుబట్టాడు.దీంతో దర్శకనిర్మాతలు కూడా చేసేదేమీ లేక థియేటర్లు తెరుచుకునే వరకు వెయిట్ చేస్తామని అన్నారు.

ఇక ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో ఐశ్యర్యా లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ సినిమా ధనుష్ కెరీర్‌లో 40వ చిత్రంగా వస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

మరి ఈ సినిమాతో ధనుష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అనేది ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ధనుష్ గతచిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube