తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జగమే తాంద్రిరం’పై తమిళ వర్గాల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఈ సినిమాతో మరోసారి ధనుష్ తనదైన మార్క్ వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో చిత్ర యూనిట్ అయోమయంలో పడింది.
కాగా ప్రస్తుతం ఓటీటీల హవా సాగుతోండటంతో ఈ సినిమాను కూడా అదే బాటలో రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు.కానీ ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో థియేటర్లలోనే రిలీజ్ చేయాలని హీరో ధనుష్ అంటున్నాడు.
ఎంత ఆలస్యమైనా సరే ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలంటూ ధనుష్ పట్టుబట్టాడు.దీంతో దర్శకనిర్మాతలు కూడా చేసేదేమీ లేక థియేటర్లు తెరుచుకునే వరకు వెయిట్ చేస్తామని అన్నారు.
ఇక ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో ఐశ్యర్యా లక్ష్మీ హీరోయిన్గా నటిస్తోంది.ఈ సినిమా ధనుష్ కెరీర్లో 40వ చిత్రంగా వస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
మరి ఈ సినిమాతో ధనుష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అనేది ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ధనుష్ గతచిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చిన సంగతి తెలిసిందే.