పులి అంటేనే వెంటాడి వేటాడి తినాల్సి ఉంటుంది.వెంటాడి చంపితినే దానికి ఆహారం లేదంటే అది ఆరోజు అంత పస్తులు ఉండాల్సిదే.
సాధారణంగా అయితే పులులు ఇతర జంతువులను వేటాడడం మనం చూసి ఉంటాం.కానీ ఇప్పుడు రెండు పులులు భయంకరంగా యుద్ధం చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నిజానికి ఈ వీడియో గత సంవత్సరమే సోషల్ మీడియాలో వైరాల్ గా మారగా ఇప్పుడు అటవీ శాఖ అధికారి సుశాంత్ నంద మరోసారి షేర్ చెయ్యడంతో వైరల్ గా మారింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.
కర్ణాటకలోని బన్నర్ఘట్ట బయోలాజికల్ పార్క్లో రెండు పులులు ఒకదానిపై ఒకటి దాడికి దిగాయి.అది అంత వీడియో తీశారు.
ఇంకా ఆ వీడియోను సుశాంత్ నంద షేర్ చేస్తూ ”ఈ ప్రపంచంలో మానవ సంబంధం ఈ కంచె వలె బలంగా ఉంటే’ అనే కాప్షన్ పెట్టి ట్విట్ చేశారు. 45 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో కంచెకు ఇరువైపుల ఉన్న సఫారీ టైగర్, వైల్డ్ టైగర్ పెద్దగా గాండ్రిస్తూ యుద్దానికి దిగాయి.
ఈ వీడియో నెటిజన్లు ఎంతగానో ఆకట్టుకుంది.మరి మీరు ఓసారి ఈ వీడియో చూసేయండి.