చలో సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక ప్రస్తుతం స్టార్ హీరోలతో జత కట్టే అవకాశాన్ని సొంతం చేసుకొని ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్ కి వచ్చింది.తాజాగా మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు అల్లు అర్జున్ కి జోడీగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకి కూడా రష్మిక ఇప్పటికే ఫైనల్ అయ్యింది.ఇక నితిన్ కి జోడీగా నటిస్తున్న భీష్మ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.
ఈ సినిమా కూడా హిట్ అయితే రష్మిక రేంజ్ మారిపోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తున్న ఇప్పటికే ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయిందని వస్తున్నా అవకాశాలు చూస్తూ ఉంటే తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ని కూడా ఈ అమ్మడు సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.
అది కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రానున్న సినిమాలో ఈ భామని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.అల వైకుంఠపురములో సినిమాతో విజయాన్ని అందుకున్న త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాను ఎన్టీఆర్ తో చేయనున్నాడని టాక్ వినిపిస్తుంది.
ఈ సినిమాలో కథానాయికగా రష్మిక అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమా లో మెయిన్ హీరోయిన్ అంటే కచ్చితంగా ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి వదులుకునే అవకాశం అయితే లేదు.
మరో వైపు పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో తేరకెక్కే సినిమా కోసం కూడా రష్మిక పేరు పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.