తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణకు టీడీపీ అధినేత చంద్రబాబు గిఫ్ట్ ఇచ్చాడని … తిరిగి ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని.లేకపోతే పద్దతిగా ఉండదని ఎటకారపు వ్యాఖ్యలు చేయడం… దాని మీద అనేక కథనాలు ప్రచారం చేయడం తెలిసిందే.
తాజాగా ఆ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించాడు.ఈ రోజు విశాఖపట్నం జిల్లా తగరపువలసలో ఆయన మాట్లాడుతూ… ‘మంచో చెడో విభజన జరిగింది.
గొడవలు వద్దు.అభివృద్ధి జరగాలి అనుకున్నా.
రెండు రాష్ట్రాలూ ముందుకు వెళ్లాలని అనుకున్నా’నని అయన వ్యాఖ్యానించారు.
తెలంగాణలో పని చేయడం తప్పు అన్నట్టు బర్త్డే గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ అంటున్నారని చెప్పారు.కేసీఆర్ వ్యాఖ్యలకు తాను భయపడనని చంద్రబాబు స్పష్టంచేశారు.మన రాష్ట్రానికి ప్రత్యేక హోదాను టీఆర్ఎస్ వ్యతిరేకించిందని చెప్పిన బాబు.
విభజన తర్వాత ఆదాయం ఆ రాష్ట్రానికి వెళ్లిందన్నారు.కేసీఆర్ ఫొటోలు పెట్టుకుని మన ప్రతి పక్షాల వాళ్లు ఊరేగుతున్నారని.
కొంతమంది మధ్య విభేదాలు ఉంటేనే వారికి బాగుంటుందని అనుకుంటున్నారని విమర్శించారు.