ఏపీలో మూడు రాజధానులకు మద్ధతుగా వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా చేశారు.ఈ నేపథ్యంలో రాజధాని వికేంద్రీకరణకు మద్ధతుగా ఏర్పడిన జేఏసీకి విశాఖలో రాజీనామా లేఖ అందించారు.
స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ రాశారు ఎమ్మెల్యే కరణం.అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖలో ఈనెల 15న భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు.
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు దమ్ముంటే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.ఆయనపై తానే పోటీకి దిగుతానని చెప్పారు.