కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్.ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ కంపెనీ నుంచి అర్జున ఫల్గుణ అనే చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.
అర్జున ఫల్గుణ నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాట అందరినీ ఆకట్టుకుంది.నేడు కాపాడేవా రాపాడేవా? అనే మరో పాటను విడుదల చేశారు.ఈ పాట ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ అయ్యేలా ఉంది.ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ అద్భుతమైన బాణీని ఇచ్చారు.
ఈ పాటలో శ్రీ విష్ణు అతని స్నేహితులు, అమృతా అయ్యర్ అందరూ కనిపిస్తున్నారు.చైతన్య ప్రసాద్ రాసిన సాహిత్యం ఎంతో పవర్ ఫుల్గా ఉన్నాయి.మోహన భోగరాజు గాత్రం స్పెషల్ అట్రాక్షన్గా మారింది.
టీజర్, ఫస్ట్ సింగిల్కు విశేషమైన స్పందన రాగా.ఈ రెండో పాట కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎన్ ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు.పి.సుధీర్ వర్మ మాటలు అందించారు.పి.జగదీష్ చీకటి కెమెరామెన్గా వ్యవహరిస్తున్నారు.
నటీనటులు :
శ్రీ విష్ణు, అమృతా అయ్యర్, నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ చౌదరి, చైతన్య తదితరులు.
సాంకేతిక బృందం
నిర్మాతలు : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి.సహ నిర్మాత : ఎన్ ఎమ్ పాషా.స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : తేజ మర్ని.డైలాగ్స్ : సుధీర్ వర్మ.పి.సినిమాటోగ్రపీ : జగదీష్ చీకటి.ఆర్ట్ డైరెక్టర్ : గంధి నడికుడికర్.యాక్షన్ : రామ్ సుంకర.మ్యూజిక్ డైరెక్టర్ : ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్.లిరిక్స్ : చైతన్య ప్రసాద్.పబ్లిసిటీ డిజైన్ : అనిల్&భాను.పీఆర్వో : వంశీ-శేఖర్.కాస్ట్యూమ్ డిజైనర్ : ప్రసన్న వర్మ దంతులూరి
.