హైదరాబాద్ గోల్కొండ పీఎస్పరిధిలో బుధవారం (నిన్న) సాయింత్రం నల్ల చిరుత కనిపించి కలకలం రేపింది.కరోనా మహమ్మారిని నియంత్రించే నేపథ్యంలో గత 55 రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఇంకా అలాంటి ఈ సమయంలో లాక్ డౌన్ కారణంగా రహదారులపై రాకపోకలు తగ్గాయి.
రహదారులపై జన సంచారం లేకపోవడంతో అటవీ జంతువులు ఎంతో ఆనందంగా అటు ఇటు తిరుగుతున్నాయి.
ఇంకా ఈ నేపథ్యంలోనే గోల్కొండ పీఎస్ పరిధిలోని ఫతేదర్వాజా పరిసరాల్లో నల్ల చిరుత తిరుగుతున్నట్టు స్థానికులు తెలిపారు.అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను స్థానిక పోలీసులకు అందించి సమాచారం అందించారు.
దీంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు.ఎట్టకేలకు ఆ నల్ల చిరుతను ప్రత్యేక బోనులో అతి కష్టం మీద దాన్ని పట్టుకున్నారు.
స్థానికులు నల్ల చిరుత అని భయాందోళనకు గురయ్యారని, కానీ అది ”మాను పిల్లి” అని అటవీశాఖ అధికారులు తెలిపారు.దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.