విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐకి అనూహ్య స్పందన లభించింది.బిడ్ సమయం ముగిసే సరికి సుమారు 22 సంస్థలు పాల్గొన్నట్లు సమాచారం.
అయితే తెలంగాణ పాల్గొనడంపై అధికారులు ఎటువంటి నిర్ధారణ ఇవ్వలేదని తెలుస్తోంది.
మరోవైపు ఈ బిడ్ లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ప్రైవేట్ సంస్థ తరపున బిడ్ లో పాల్గొన్న ఆయన క్రౌడ్ ఫండింగ్ ద్వారా మూలధనం సేకరిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఎనిమిది కోట్ల మంది తెలుగు ప్రజలు ఒక్కొక్కరు వంద రూపాయలు ఇచ్చినా 800 కోట్లు అవుతుందన్నారు.
నాలుగు నెలల వ్యవధిలో ముడి సరుకు సేకరిస్తామని లక్ష్మీనారాయణ వెల్లడించారని సమాచారం.