తెలుగు సినీ పరిశ్రమలో ఒక అగ్రనటిగా ఒక వెలుగు వెలిగింది వాణిశ్రీ.( Vanisri ) ఆమె 1962లో తెలుగులో భీష్మ సినిమాతో( Bheesma Movie ) సినీ రంగ ప్రవేశం చేసింది.1970లలో అగ్ర నటిగా ఎదిగింది.ఈ అందాల తార అనేక విజయవంతమైన చిత్రాలలో నటించింది, వీటిలో ‘అల్లరి పిల్ల’, ‘బంగారు కుంకుమ’, ‘బంగారు పిట్ట’, ‘ఆడపిల్ల’ వంటివి ఉన్నాయి.1978లో వాణిశ్రీ డాక్టర్ కరుణాకరన్ను వివాహం చేసుకుంది.కొంతకాలం సినిమాలకు దూరమయింది.
ఆమె 1989లో తిరిగి వచ్చింది.అప్పటి నుండి అనేక చిత్రాలలో నటించింది.
వాణిశ్రీ హీరోయిన్గానే కాకుండా, వివిధ పాత్రలలో నటించడంలో ప్రసిద్ధి చెందారు.ఆమె విలన్, కమెడియన్ వంటి పాత్రలలో నటించింది.ముఖ్యంగా ఆమె అత్త పాత్రలను అద్భుతంగా పోషించి వెండితెరపై మంటలు పుట్టించింది.అత్తగా ఆమె సిల్వర్స్క్రీన్ షేక్ చేసిన సినిమా లేవో చూసుకుంటే అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989),( Attaku Yamudu Ammayiki Mogudu ) బొబ్బిలి రాజా (1990),( Bobbili Raja ) అల్లరి అల్లుడు (1991),( Allari Alludu ) కలెక్టర్ గారి అల్లుడు (1993), హలో అల్లుడు (1994), బొంబాయి ప్రియుడు (1996) ఉన్నాయి.

ఈ సినిమాలలో వాణిశ్రీ అత్త పాత్రలో అద్భుతంగా నటించారు.ఆమె నటనలో హాస్యం, భావోద్వేగం, సెంటిమెంట్ అన్నీ కలిసి ఉంటాయి.ఆమె నటనకు ప్రేక్షకులు ఎల్లప్పుడూ ప్రశంసిస్తారు.వాణిశ్రీ అత్త పాత్రలో నటించిన సినిమాలు తెలుగునాట విజయవంతమయ్యాయి.ఆమె నటనకు ప్రేక్షకులు అభిమానులు అయ్యారు.వాణిశ్రీ తెలుగు సినిమాలో అత్త పాత్రకు అర్థం ఇచ్చారు.
K.బాలచందర్( K Balachander ) రాసిన సుఖ దుఃఖాలు, మరపురాని కథ (1967)లో ఆమె సహాయక పాత్రతో దృష్టిని ఆకర్షించింది.

కృష్ణవేణి, ప్రేమ్ నగర్, దసరా బుల్లోడు, ఆరాధన, జీవిత చక్రం, రంగుల రత్నం, శ్రీకృష్ణ తులాభారం, భక్త కన్నప్ప, బొబ్బిలి రాజా వంటి సూపర్ హిట్ చిత్రాలలో ఆమె నటించింది.40 ఏళ్ల సినీ కెరీర్లో, ఆమె మూడు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్, నంది అవార్డులు,( Nandi Award ) తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డును అందుకుంది.ఆమె అసలు పేరు రత్న కుమారి.ఈ తార చెన్నైలోని ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో చదివింది.భరతనాట్యంలో శిక్షణ కూడా తీసుకుంది.