అందం, అభినయం పుష్కలంగా ఉన్న పూజా హెగ్డే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలతో బిజీగా ఉంది.త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో సినిమాల్లో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డేకు ఆ సినిమాల్లోని పాత్రలు మంచిపేరు తెచ్చిపెట్టాయి.
ప్రస్తుతం పూజా హెగ్డే ప్రభాస్ కు జోడీగా రాధే శ్యామ్ సినిమాలో నటిస్తోంది.ప్రభాస్ కు జోడీగా నటిస్తూ ఉండటంతో ఇతర ఇండస్ట్రీల్లో సైతం మంచి గుర్తింపు వస్తుందని పూజా హెగ్డే భావిస్తోంది.అయితే ఎప్పుడూ కూల్ గా ఉండే పూజా హెగ్డే ఒక డైరెక్టర్ పై మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతోందని.ఆ డైరెక్టర్ పేరు తన దగ్గర పలకవద్దని చెబుతోందని తెలుస్తోంది.
ఆ డైరెక్టర్ పై పూజా ఇంతగా సీరియస్ కావడానికి ప్రత్యేకమైన కారణమే ఉంది.ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపికైందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది.
అయితే ఊహించని విధంగా ఆమె స్థానంలో మరో హీరోయిన్ ఎంపికైంది.
మంచి సినిమాలో పూజాకు ఒక డైరెక్టర్ వల్ల ఛాన్స్ మిస్ అయింది.
ఆ సినిమాలో తనే హీరోయిన్ అని పూజా ఫిక్స్ అయిన సమయంలో ఆ విధంగా జరగడం ఆమెను ఎంతో బాధ పెట్టింది.ఆ తరువాత నుంచి ఆ దర్శకుడి పేరు ఎవరైనా పలికినా పూజా అగ్గి మీద గుగ్గిలం అవుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఆ డైరెక్టర్ పూజాను కావాలనే తప్పించాడో లేక పూజాను తప్పించడానికి ఇతర కారణాలేమైనా ఉన్నాయో తెలియాల్సి ఉంది.
అయితే ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వసాధారణమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇతర ఇండస్ట్రీల్లో అవకాశాలు వస్తున్నా టాలీవుడ్ ఇండస్ట్రీకే పూజా హెగ్డే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వరుస అవకాశాలతో బిజీగా ఉండటం గమనార్హం.