మరి కాసేపటిలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు( Telangana assembly ) ప్రారంభం కానున్నాయి.ఇందులో భాగంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్( Tamilisai Soundararajan ) ప్రసంగించనున్నారు.
ఇప్పటికే గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.అయితే రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
దీంతో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ్టి గవర్నర్ తమిళిసై ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.కాగా ఎల్లుండి సభలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్( Vote on account Budget ) ను ప్రవేశపెట్టనున్నారు.అటు శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.అసెంబ్లీ సమావేశాలు ఈనెల 17వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.