ఒక ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం సాధించడం సులువు కాదనే సంగతి తెలిసిందే.అయితే ఒక వ్యక్తి మాత్రం ఒకవైపు సాఫ్ట్ వేర్ ఉద్యోగం( Software Job ) చేస్తూనే మరోవైపు సివిల్స్ ( Civils ) సాధించాడు.
ఎంతో కష్టపడి తన సక్సెస్ తో ప్రశంసలు అందుకోవడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.బొల్లం మహేశ్వరరెడ్డి( Bollam Maheshwar Reddy ) సక్సెస్ స్టోరీ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.
మహేశ్వరరెడ్డి స్వస్థలం బోయపల్లి కాగా ప్రస్తుతం ఇతని కుటుంబం కదిరిలో స్థిరపడింది.
మహేశ్వరరెడ్డి తండ్రి విశ్రాంత జువాలజీ లెక్చరర్ కాగా తల్లి పద్మావతి విశ్రాంత ఉపాధ్యాయురాలు.
ఐఐటీలో బీటెక్( B.Tech ) చదివిన మహేశ్వరరెడ్డి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో సివిల్స్ ను ఎంచుకుని ప్రిపేర్ అయ్యారు.చదువు విషయంలో పేరెంట్స్ నుంచి సపోర్ట్ లభించడంతో ఒకవైపు సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూనే మహేశ్వరరెడ్డి సివిల్స్ లో చేరారు.ఢిల్లీలోని వాజీరాలో సివిల్స్ కోసం శిక్షణ తీసుకున్నాడు.
ఒకవైపు జాబ్ చేస్తూనే సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యి సులువుగా లక్ష్యాన్ని సాధించాడు.ఎట్టకేలకు తన కష్టానికి తగిన ఫలితం దక్కిందని మహేశ్వరరెడ్డి అన్నారు.జాతీయ స్థాయిలో 270వ ర్యాంక్( Civils 270th Rank ) సాధించి మహేశ్వరరెడ్డి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచింది.కొడుకుకు సివిల్స్ లో మంచి ర్యాంక్ రావడంతో కుటుంబ సభ్యుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
మహేశ్వరరెడ్డి తన టాలెంట్ తో ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు.బాల్యం నుంచి మహేశ్వరరెడ్డి చదువులో టాప్ లో ఉండేవారని తెలుస్తోంది.లక్ష్యాన్ని ఎంతో కష్టపడి సాధించిన మహేశ్వరరెడ్డి ప్రజలకు తన జాబ్ ద్వారా సేవ చేయాలని ఫీలవుతుండటం గమనార్హం.మహేశ్వరరెడ్డి తన ప్రతిభతో ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఈ స్థాయికి చేరుకోవడంతో పాటు సివిల్స్ సాధించాలన్న కలను నెరవేర్చుకుని కుటుంబ సభ్యులకు ఆనందాన్ని కలిగించారు.