టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు శర్వానంద్( Sharwanand ) ఒకరు.ఈయన కెరియర్ మొదట్లో హీరోలకు తమ్ముడి పాత్రలలో నటిస్తూ అనంతరం హీరోగా సినిమా అవకాశాలను అందుకున్నారు.
ఇలా హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా శర్వానంద్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఇక గత ఏడాది ఈయన రక్షిత రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి కూడా అడుగుపెట్టారు.
ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలోను వృత్తిపరమైన జీవితంలోనూ శర్వానంద్ ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఇదిలా ఉండగా తాజాగా శర్వానంద్ మంచు మనోజ్ ( Manchu Manoj ) వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నటువంటి ఉస్తాద్ ( Ustad ) కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ శర్వానంద్ ఆస్తుల గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.మీ జీవితంలో నీకు ఉస్తాద్ ఎవరు అంటూ మనోజ్ ప్రశ్నించగా వెంటనే శర్వానంద్ తన తాతయ్య అంటూ సమాధానం చెప్పారు.
ఎందుకు నీకు ఆస్తులన్నీ రాసిచ్చాడనnఅంటూ మనోజ్ సెటైర్స్ వేశారు.
శర్వానంద్ తన తాతయ్య నుంచి కొన్ని వందల కోట్ల ఆస్తులను వారసత్వంగా తీసుకున్నారనే విషయం తెలిసిందే.హైదరాబాదులో ఎంతో విలువైనటువంటి ల్యాండ్స్ అన్ని కూడా ఈయన పేరు మీద రాశారట అందుకే మనోజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా శర్వానంద్ మెగాస్టార్ చిరంజీవి అలాగే రామ్ చరణ్ ( Ram Charan ) తో కలిసి ఉన్నటువంటి ఫోటోలను చూపించారు.
ఈ ఫోటోలపై ఈయన పలు విషయాలను వెల్లడించారు.ఇక రాంచరణ్ గురించి మాట్లాడుతూ రాంచరణ్ లాంటి స్నేహితుడు నాకు దొరకడం నిజంగా నేను చేసుకున్న అదృష్టమంటూ శర్వానంద్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.