ఏపీ సీఎం జగన్ రేపు ఢీల్లీ వెళ్లుతున్నాడనే వార్తలు నిన్నటి నుండి వస్తున్న విషయం తెలిసిందే.కానీ ఇంతలో ఊహించని ట్విస్ట్.
అదేమంటే వైఎస్ జగన్ ఢీల్లీ పర్యటన వాయిదా పడిందట.
ఇక ఢీల్లీ వెళ్లి ఏపీలో నెలకొన్న పరిస్దితుల పై అలాగే పోలవరం ప్రాజెక్టు, విభజన సమస్యలు, వ్యాక్సిన్ వంటి అంశాలను కేంద్ర పెద్దలతో చర్చిద్దామని అనుకున్నారట.
కానీ కేంద్ర మంత్రులు బిజీగా ఉండడంతో వీరి అపాయింట్మెంట్లు దొరక్కపోవడంతో వాయిదా పడినట్లు సమాచారం.
అయితే జగన్ తన ప్రయాణాన్ని గురువారం అంటే ఈ నెల 10వ తారీఖున ఖరారు చేసుకునే అవకాశాలున్నాయని సమాచారం.
ఇకపోతే సీఎం జగన్ తన పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారని కథనాలు వినిపిస్తున్నాయి.ఇకపోతే జగన్ ఢీల్లీ పర్యటన పై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇందుకు విజయ సాయిరెడ్ది కూడా తనదైన శైలిలో ఎదురు విమర్శలు గుప్పిస్తున్నారు.