హీరో రాజ్ తరుణ్ గురించి అందరికి విదితమే.చాలా కింది స్థాయినుండి హీరోగా ఎదిగిన వాళ్లలో ఈయన ఒకరు.
ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేసిన తరువాత తెలుగు ఇండస్ట్రీ నుండి ఈయనకు పిలుపు వచ్చింది.తన మొదటి సినిమా అయినటువంటి ‘ఉయ్యాలా జంపాల’ సినిమాతోనే రాజ్ తరుణ్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆ సినిమాలో ఆయన సహజ నటన, డైలాగుల కు మంచి మార్కులే పడ్డాయి .
ఇక ఆ తర్వాత కూడా ఓ రెండు సినిమాలు వరుసగా మంచి ఫలితాన్నే ఇచ్చాయి.కానీ, తరువాత వచ్చిన సినిమాలు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు.అలాగే ఇటీవల దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన లవర్ అనే సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
ఇకపోతే తన తాజా సినిమా ‘ఒరేయ్ బుజ్జిగా’ అనే టైటిల్ తో వస్తున్న సంగతి విదితమే.ఈ సినిమాకు విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించగా.ఇందులో మాళవిక హీరోయిన్ గా చేసింది.
విజయ్ కుమార్ గతంలో “గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ సినిమాలకు దర్శకత్వం వహించాడు.
ఈ సినిమా ఎప్పుడో విడుదల అవ్వవలసింది.కానీ కరోనా కారణంగా వాయిదా పడింది.
ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు కనుక ఈ సినిమా కూడా చాలా సినిమాల్లా లాగే ఓటీటీ లో రిలీజ్ చేయడానికి చిత్రబృందం ఓకే చెప్పింది.అందులో భాగంగానే ఈ సినిమా రైట్స్ ను ‘జీ గ్రూప్’ దక్కించుకుంది.ఇకపోతే ఇలాంటి గడ్డుకాలంలో కూడా ఈ సినిమా పెద్ద మొత్తంలో అమ్ముడు పోయిందని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.‘ఒరేయ్ బుజ్జిగా’ కోసం ఏకంగా 13 కోట్లకు పైగానే ‘జీ గ్రూప్’ అందించిందని.ఇంత పెద్ద మొత్తం అందుకోవడం నిజంగానే హీరో రాజ్ తరుణ్ చేసుకున్న అదృష్టం అని టాలీవుడ్ టాక్.అయితే ఇందుకు సంబంధించి ఇది వరకే ‘ఆహా’ తో సంప్రదింపులు జరిగాయట కూడా.
చివరికి ఏమైందో ఏమో కానీ ‘జీ గ్రూప్’ దక్కించుకుంది.