మిచౌంగ్ తుపాను( Michaung Cyclone ) ప్రభావం గట్టిగా ఉంది.బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుఫాను తిరుపతి, నెల్లూరు జిల్లాలపై అత్యధిక ప్రభావం చూపిస్తుంది.
మిచౌంగ్ ప్రభావంతో ఈ రెండు జిల్లాలలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి.దీంతో నెల్లూరు చెన్నై జాతీయ రహదారిపై( Nellore Chennai Highway ) సూళ్లూరుపేట టోల్ ప్లాజా వద్ద నాలుగు అడుగుల మేర నీరు ప్రవహిస్తుంది.
దీంతో అప్రమత్తమైన అధికారులు.జాతీయ రహదారి మూసివేయడం జరిగింది.
దీంతో నెల్లూరు చెన్నై మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.ఇదే సమయంలో తుఫాన్ నేపథ్యంలో ప్రయాణికుల అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేయడం జరిగింది.
ఈ క్రమంలో తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డులలో( Tirumala Tirupati Ghat Road ) ద్విచక్ర వాహనదారులకు ఆంక్షలు విధించడం జరిగింది.ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే ఘాట్ రోడ్ లపై ప్రయాణించేందుకు అనుమతి ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది.ఇక ఇదే సమయంలో ప్రభుత్వం ఈ రెండు జిల్లాలలో పునరావాస కేంద్రాలు భారీగా ఏర్పాటు చేయడం జరిగింది.మిచౌంగ్ తుపాన్ మంగళవారం తీరాన్ని తాకే సమయంలో మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ క్రమంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని తెలియజేయడం జరిగింది.ఇదే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీలైనంత వరకు బయటకు వెళ్లొద్దని ప్రభుత్వం హెచ్చరించడం జరిగింది.