కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Amit Shah ) ఆడియో మార్ఫింగ్ దేశ భద్రతకు సంబంధించిన విషయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి( BJP Kishan Reddy ) అన్నారు.సమాజంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలని కొందరు చూస్తున్నారని మండిపడ్డారు.
రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.సీఎం రేవంత్ రెడ్డిని కోర్టుకు ఈడుస్తామన్న కిషన్ రెడ్డి సీఎం మాటలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిందన్నారు.
రిజర్వేషన్లు తీసివేసేది లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా చెప్పారన్నారు.రిజర్వేషన్ల ఆరోపణలతో రేవంత్ రెడ్డి విశ్వసనీయత కోల్పోయారని తెలిపారు.
సీఎం స్థాయిని రేవంత్ రెడ్డి దిగజార్చుతున్నారని విమర్శించారు.