ఈ నెల 20 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర..!

పార్లమెంట్ ఎన్నికలు( Parliament Elections ) సమీపిస్తున్న తరుణంలో ప్రచారంపై గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది.ఈ మేరకు ఎల్లుండి నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్( BRS Party Leader KCR ) బస్సు యాత్ర నిర్వహించనున్నారు.

 Kcr Bus Yatra From 20th Of This Month..!,kcr,brs,bus Yatra,parliament Elections,-TeluguStop.com

ఈ క్రమంలో అలంపూర్ జోగులాంబ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర( KCR Bus Yatra ) ప్రారంభం కానుంది.తెలంగాణ భవన్ లో ఎంపీ అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం అయిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా అభ్యర్థులకు బీ-ఫారాలు( B Forms ) అందించిన కేసీఆర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.ఎన్నికల వ్యూహాలు, ప్రచార సరళి, కార్యాచరణపై కేసీఆర్ నేతలతో చర్చించారు.అనంతరం ఎన్నికల ఖర్చు కోసం ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చొప్పున చెక్ ను అందజేశారు.కాగా సుమారు ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube