ఈ నెల 20 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర..!

పార్లమెంట్ ఎన్నికలు( Parliament Elections ) సమీపిస్తున్న తరుణంలో ప్రచారంపై గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది.

ఈ మేరకు ఎల్లుండి నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్( BRS Party Leader KCR ) బస్సు యాత్ర నిర్వహించనున్నారు.

ఈ క్రమంలో అలంపూర్ జోగులాంబ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర( KCR Bus Yatra ) ప్రారంభం కానుంది.

తెలంగాణ భవన్ లో ఎంపీ అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం అయిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా అభ్యర్థులకు బీ-ఫారాలు( B Forms ) అందించిన కేసీఆర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.

ఎన్నికల వ్యూహాలు, ప్రచార సరళి, కార్యాచరణపై కేసీఆర్ నేతలతో చర్చించారు.అనంతరం ఎన్నికల ఖర్చు కోసం ఒక్కో అభ్యర్థికి రూ.

95 లక్షల చొప్పున చెక్ ను అందజేశారు.కాగా సుమారు ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!