బీఆర్ఎస్ నేత క్రిశాంక్( BRS leader Krishank ) పోలీస్ కస్టడీ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో( Nampally Court ) విచారణ జరిగింది.ఉస్మానియా యూనివర్సిటీ( Osmania University ) పేరుతో ఫేక్ సర్క్యులర్ క్రియేట్ చేశారని క్రిశాంక్ పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ ( Congress ) ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు క్రిశాంక్ ను అరెస్ట్ చేశారు.తాజాగా క్రిశాంక్ ను రెండు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అలాగే తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ క్రిశాంక్ కూడా పిటిషన్ వేశారు.ఈ రెండు పిటిషన్లపై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి.ఈ క్రమంలో తీర్పును రేపు వెల్లడిస్తామని నాంపల్లి కోర్టు తెలిపింది.అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.