ప్రముఖ నటి జయప్రద ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒకరోజు ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని ఆ సమయంలో తాను బెంగళూరులో కన్నడ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు.సీనియర్ ఎన్టీఆర్ కాల్ లో సాయంత్రం ఒకసారి మాట్లాడాలని అన్నారని జయప్రద చెప్పుకొచ్చారు.
నేను షూటింగ్ లో ఉన్నానని చెప్పినా ఆయన ఖచ్చితంగా రావాలని చెప్పారని జయప్రద కామెంట్లు చేశారు.
ఆ సమయంలో ఎన్టీఆర్ కోరిక మేరకు టీడీపీలో జాయిన్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చారు.
ఆ ఫోన్ కాల్ వల్ల తాను టీడీపీలో చేరానని ఆమె అన్నారు.సినిమాల్లో ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆమె అన్నారు.
సీనియర్ ఎన్టీఆర్ సీఎం అయిన సమయంలో తనకు సంతోషం కలిగిందని ఆమె తెలిపారు.సీనియర్ ఎన్టీఆర్ గొప్ప నటుడైనా పంప్ ల దగ్గర స్నానం చేసేవారని అమ్మా.
గుక్కెడు గంజి ఇవ్వమ్మా అని ముసలి తల్లులను ఆప్యాయంగా సీనియర్ ఎన్టీఆర్ అడిగేవారని ఇవన్నీ ప్రజలకు బాగా నచ్చాయని జయప్రద చెప్పుకొచ్చారు.
నాకు కూడా సీనియర్ ఎన్టీఆర్ నుంచి అదే స్పూర్తి అని ఆమె వెల్లడించారు.ప్రజలు నన్ను ఆదరించడం వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానని ఆమె చెప్పుకొచ్చారు.నటనకే నటన నేర్పిన నటుడు ఎన్టీఆర్ అని జయప్రద అన్నారు.
కాంగ్రెస్ కరప్షన్ లో ఉన్న సమయంలో కాంగ్రెస్ ను కూకటివేళ్లతో పెకిలించాలని ఆయన రాజకీయాల్లోకి వచ్చారని జయప్రద కామెంట్లు చేయడం గమనార్హం. సీనియర్ ఎన్టీఆర్ ను చూసి మనం గర్వపడాలని ఆమె చెప్పుకొచ్చారు.
సీనియర్ ఎన్టీఆర్ చేసిన పనులు ముందు తరాలకు తెలియాలని ఆమె కామెంట్లు చేశారు.కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవని జయప్రద అన్నారు.
చంద్రబాబుకు మద్దతు ఇచ్చి తాను తప్పు చేశానని ఆ విషయంలో నేను ఇప్పటికీ గిల్టీగా ఫీలవుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు.