విద్యుత్.చార్జీలు, నిత్యావసరాల ధరలు దిగి రావాలంటే జగన్ దిగి పోవాల్సిందే అని రాజమహేంద్రవరం సిటీ టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అన్నారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక జగదీశ్వరి హోటల్ నందు జరిగిన రాజమహేంద్రవరం సిటీ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే భవాని మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాలు, ఇసుక, సిమెంట్, ఐరన్, విద్యుత్ ఛార్జీలు ఏది చూసినా అన్నీ బాదుడే బాదుడు అంటూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు
.