సమంత ( Samantha )హీరోయిన్ గా నటించిన శాకుంతలం( Sakunthalam ) చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.గుణశేఖర్ ( Gunasekar )స్వీయ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు( dil raju ) తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేశాడు.
ఈ సినిమా కోసం దిల్ రాజు దాదాపుగా 40 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాడు అంటూ ప్రచారం జరుగుతుంది.అంత మొత్తానికి తగ్గట్లుగా సినిమా రైట్స్ ద్వారా దిల్ రాజు సంపాదించాడా అంటే అనుమానమే అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.అసలు దిల్ రాజు ఈ సినిమా ని ఏ ఉద్దేశం తో.ఏ నమ్మకంతో సమర్పించేందుకు ముందుకు వచ్చాడో అర్థం కావడం లేదంటూ కొందరు సినిమా ను చూసిన తర్వాత కామెంట్స్ చేస్తున్నారు.
సినిమా ప్రారంభం సమయం లోనే దిల్ రాజు ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా జాయిన్ అయిన విషయం తెలిసిందే.హీరో పాత్ర విషయం లో దిల్ రాజు కాస్త జోక్యం చేసుకుంటే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
దిల్ రాజు పట్టించుకోక పోవడం వల్ల మలయాళ నటుడు దేవ్ మోహన్( Dev Mohan ) ని ఎంపిక చేయడం జరిగింది అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు.ఆ తర్వాత హీరోయిన్ సమంత పాత్ర విషయం లో కూడా దిల్ రాజు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారట.
అయినా కూడా దిల్ రాజు సలహాలను దర్శకుడు గుణశేఖర్ పట్టించుకోలేదని ప్రచారం జరుగుతుంది.తన సొంత సినిమాలు కాకుండా ఇలా సహ నిర్మాతగా సమర్పకుడిగా దిల్ రాజు సినిమాలు చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బలగం సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దిల్ రాజు శాకుంతలం సినిమా తో చేదు అనుభవం తప్పలేదు అంటూ బాక్సాఫీస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.